Sunday, May 5, 2024
- Advertisement -

శ్రీకాకుళం తుఫాన్ బాధితుల‌కు టాలీవుడ్ సాయం

- Advertisement -

ఇటీవ‌లే శ్రీకాకుళం జిల్లాని తిత్లీ తుఫాన్ అత‌లకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే.తిత్లీ తుఫాన్ తుఫాన్ వ‌ల్ల శ్రీకాకుళం జిల్లా నాశనం అయింది.జిల్లాలోని స‌గంపై పంట న‌ష్టం జ‌రిగిందని ప్ర‌భుత్వం అంచ‌నాకు వ‌చ్చింది.. ఇలాంటి ప్రతి సందర్బంలో మన స్టార్లు విరివిగా విరాళాలు అందిస్తూ గొప్ప సాయం ప్రకటిస్తున్నారు. మూవీ ఆర్టిస్టుల సంఘం తనవంతు సాయానికి ముందుకొస్తూ మంచిని చాటుతోంది. ఇండివిడ్యువల్ గా స్టార్లు – నటీనటులు సాయం ప్రకటిస్తూ ధాతృత్వం చాటుకుంటున్నారు.ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకు తిత్లీ తుఫాన్ వల్ల కేవలం కొన్ని గంటల్లోనే తీరని నష్టం వాటిల్లింది. 2400 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. పేదప్రజలంతా కూడు- గూడు లేక రోడ్డున పడాల్సొచ్చింది. ఆ దృశ్యాలు టీవీల్లో చూసి సెలబ్రిటీలు వెంటనే స్పందిస్తున్నారు.

ఇప్పటికే పలువురు తారలు సీఎం రిలీఫ్ ఫండ్ కి భారీ మొత్తాల్ని విరాళంగా ప్రకటిస్తున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ 25లక్షలు – ఎన్టీఆర్ 15లక్షలు – కళ్యాణ్ రామ్ 5లక్షలు ప్రకటించారు. ఆ తర్వాత బాలకృష్ణ కుమార్తె మరో 60లక్షలు ప్రకటించారు. మెగా హీరోల్లో అల్లు అర్జున్ 25లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ప్రకటించారు. అలాగే వరుణ్ తేజ్ – నిఖిల్ – సంపూర్ణేష్ – విజయ్ దేవరకొండ వంటి స్టార్లు స్పందించి తమవంతుగా సాయాన్ని అందించారు. మూవీ ఆర్టిస్టుల సంఘం తమవంతు సాయంగా రూ.5లక్షలు ప్రకటించి ధాతృత్వం చాటుకుంది. మా అధ్యక్షులు శివాజీరాజా – ప్రధాన కార్యదర్శి నరేష్ ఈ విషయాన్ని జాయింట్ గా ప్రకటించడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -