Monday, May 13, 2024
- Advertisement -

సచిన్‌తో క్రికెట్… బాణ్‌గంగా చెరువులో పూజలు

- Advertisement -

భారత్, భూటాన్‌లలో ఏడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం నాడు ముంబాయ్ చేరుకున్న బ్రిటన్ యువరాజు విలియం, ఆయన భార్య కేట్ విలియం సందడి చేశారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో కలిసి క్రికెట్ ఆడిన వీరిద్దరు ముంబాయ్ లోని మురికివాడలను సందర్శించారు. ఓవెల్ మైదానంలో చిన్నారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు.

12 శతాబ్దం నాటిదిగా చెప్పుకుంటున్న బాణ్‌గంగా చెరువులో బ్రిటన్ యువరాజు దంపతులు పూజలు చేశారు. ముంబాయ్ చేరుకున్న వెంటనే ముందుగా తాజ్ ప్యాలెస్ హొటల్ లో 26/11 మారణకాండలో మరణించిన వారికి ఘన నివాళులు అర్పించారు.  దీని తర్వాత క్రికెట్ ఆడారు. మాస్టర్ సచిన్ టెండూల్కర్ బౌలింగ్ చేస్తే యువరాజు విలియం బ్యాటింగ్ చేశారు.

ముంబాయ్ నగరంలో పలుచోట్ల పర్యటించిన వీరిద్దరు సాయంత్రం విందులో పాల్గొన్నారు. ఈ విందులో 200 మంది ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో సినీ దిగ్గజాలు పాల్గొన్నారు. ఈ డిన్నర్ లో షారూక్ ఖాన్, ఐశ్వర్యారాయ్ వంటి ప్రముఖులుండడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -