Thursday, May 16, 2024
- Advertisement -

అల్లుడు పారిపోయినా కూతిరిని తెగ న‌రికిన తండ్రి..

- Advertisement -

మిర్యాల‌గూడ ప‌రువు హ‌త్య మ‌ర‌చిపోక‌ముందే ఇప్పుడు మ‌రో అలాంటి సంఘ‌ట‌న హైద‌రాబాద్‌లో చోటు చేసుకుంది. ఎర్ర‌గ‌డ్డ‌లోని గోకుల్ థియోట‌ర్ వ‌ద్ద ప‌ట్ట‌ప‌గ‌లే న‌వ దంపతుల‌పై అమ్మాయి తండ్రి దారునంగా దాడి చేసిన సంఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది.

ఈ దాడికి ప్ర‌ధానం కార‌ణం కులాంతర వివాహమే. మాధ‌వి బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన యువ‌తి కాగా…సందీప్ ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన యువ‌కుడు. మాధవిని అతని మేనమామకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. అయితే మేనమామను కాదని… తాను ప్రేమించిన సందీప్ ను మాధవి పెళ్లాడింది. దీంతో కొపం పెంచుకున్న తంగ్రి ఇద్ద‌రిని హ‌త మార్చేందుకు ప్లాన్ వేశారు.

ఇద్దరికీ కొత్త బట్టలు పెడతాను… రావాలంటూ ఇద్దరినీ నమ్మించి, పిలిపించాడు. ఆయన మనసులో ఉన్న దారుణ ఆలోచనను గుర్తించలేని కొత్త దంపతులిద్దరూ గోకుల్ థియేటర్ వద్దకు వచ్చి, స్కూటీపై ఆయన కోసం ఎదురు చూస్తున్నారు.

ఇంత‌లోనే స్కూట‌ర్ మీద వ‌చ్చిన తండ్రి అనూహ్య‌రీతిలో బ్యాగ్‌లోనుంచి క‌త్తి తీసి తొలుత సందీప్ పై కత్తితో దాడి చేశాడు. అక్కడ నుంచి సందీప్ పక్కకు పారిపోవడంతో… కూతురును మరింత దారుణంగా నరికాడు. వీరిద్దరూ ఆసుపత్రిలో చికత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న మాధవిని య‌శోద ఆసుప‌త్రికి స్థానికిఉలు త‌ర‌లించారు. అక్క‌డి నుంచి అమ్మాయి తండ్రి ప‌రార‌య్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -