Thursday, May 2, 2024
- Advertisement -

మహేష్ దత్తత గ్రామంపై చర్చలు

- Advertisement -

హీరో మహేష్ బాబు సతీమణి, ప్రముఖ నటి నమ్రత శిరోద్కర్ తెలంగాణ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో సమావేశమయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు మండలంలో ఉన్న సిద్ధాపూర్ గ్రామాన్ని హీరో మహేష్ బాబు దత్తత తీసుకున్నారు. ఈ గ్రామ అభివృద్ధిపై మంత్రి, హీరో మహేష్ సతీమణి నమ్రత చర్చించారు.

సిద్ధాపూర్ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరించారు. ఈ భేటీలో మమబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవి కూడా ఉన్నారు. భేటీ అనంతరం నమ్రత మాట్లాడుతూ సిద్ధాపూర్ ను స్మార్ట్ విలేజ్ గా మారుస్తామని అన్నారు. సిద్ధాపూర్ గ్రామ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని అన్నారు.

కొద్ది రోజుల క్రితం తాను సిద్ధాపూర్ గ్రామాన్ని సందర్శించానని, అక్కడున్న సమస్యలపై స్ధానిక ప్రజలను అడిగి తెలుసుకున్నానని నమ్రత చెప్పారు. గ్రామ సర్పంచ్ నర్సమ్మ అక్కడున్న సమస్యలపై నమ్రత శిరోద్కర్ కు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ లోని బుర్రిపాలెం గ్రామాన్ని కూడా మహేష్ బాబు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ గ్రామం తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామం కావడం విశేషం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -