Saturday, May 25, 2024
- Advertisement -

పాక్‌కు మ‌రో సారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆర్మీ ఛీఫ్‌…

- Advertisement -

దేశ స‌రిహ‌ద్దుల్లో తీవ్ర‌వాదాన్ని పోషిస్తున్న పాకిస్థాన్‌కు భార‌త్ ఆర్మీ ఛీఫ్ గాటుగా వార్నింగ్ ఇచ్చారు. వేల మంది సైనికుల గొంతు కోయడం ద్వారా భారతదేశాన్ని రక్తసిక్తం చేయాలని నిర్ణయించుకున్నదని ఆర్మీ చీఫ్ ఆరోపించారు. క‌వ్వింపు చ‌ర్య‌లు ఆప‌క‌పోతే మ‌రో సారి స‌ర్జిక‌ల్ దాడులు చేయాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

పాక్ నూతన ప్రభుత్వం సైతం వారి ఆర్మీని నియంత్రించడం లేదు. ఆర్మీని, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)ని అదుపు చేయనంతవరకు సరిహద్దు, ఇతరత్రా అంశాల్లో సంబంధాలు మెరుగుపడవు. పోలీసులను, ఆర్మీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ చర్చలకు ఆహ్వానించడం సమంజసం కాద‌ని వ్యాఖ్యానించారు.

ఇటీవల జవాను గొంతు కోసి హతమార్చడం, హెడ్ కానిస్టేబుల్‌ను కిడ్నాప్ చేసి చంపేయడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోందంటూ పాక్‌కు హెచ్చరిక సంకేతాలు పంపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -