Wednesday, May 15, 2024
- Advertisement -

ఇకపై కరీం నగర్ స్మార్ట్ సిటీ – కెసిఆర్ కోరిక తీర్చిన కేంద్రం

- Advertisement -

తెలంగాణ సర్కారు పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి క్రమంగా మారుతోంది. స్మార్ట్ సిటీ జాబితాలో తెలంగాణ నుంచి ఆశించిన మేర నగరాలను చేర్చలేదన్న వాదనతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రానికి ఓ లేఖ రాశారు. ఇప్పటికే ఆశించిన మేర అభివృద్ధి నమోదైన హైదరాబాదును జాబితా నుంచి తప్పించి ఆ స్థానంలో కరీంనగర్ ను చేర్చాలని ఆ లేఖలో కేసీఆర్ కేంద్రాన్ని కోరారు.

కేసీఆర్ ప్రతిపాదనను పరిశీలించిన కేంద్రం అందుకు సమ్మతించింది. జాబితా నుంచి హైదరాబాదును తొలగించి ఆ స్థానంలో కరీంనగర్ ను చేర్చింది. ఇక తదుపరి స్మార్ట్ సిటీల ఎంపికలో హైదరాబాదు స్థానంలో కరీంనగర్ పోటీలోకి వస్తుంది. ఈ మేరకు కేంద్ర మార్పు చేసిన విషయాన్ని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -