అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిన విషయం అందరికి తెలిసిందే. పరప్పణ అగ్రహార జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయిన అనంతరం శశికళను జైలుకు తరలించాలని ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే శశికళ తనకు జైలులో కావలసిన సదుపాయాల గురించి జైలు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. తనకు ప్రత్యేకంగా ఏసీ గది కావలని.. మినరల్ వాటర్ ఇవ్వాలని, ఇంటి ఆహారం పెట్టాలని ఆమె కోరారు.
అలాగే గదిలో టీవీ, మంచం ఉండేలా సదుపాయాలు కల్పించాలని కోరారు. అలాగే తన కోసం ప్రత్యేకంగా ఒక సహాయకురాలని నియమించాలని ఆ వినతిపత్రంలో శశికళ న్యాయమూర్తికి మొర పెట్టుకుంది. శశికళ ప్రతిపాదనలన్నింటినీ కోర్టు తిరస్కరించింది. శశికళ ప్రత్యేక దుస్తులు వేసుకునే అవకాశం లేదని పేర్కొంటూ ప్రత్యేక దుస్తుల అనుమతిని జైలు అధికారులు నిరాకరించారు. జైలులోనే శశికళకు దుస్తులను కేటాయిస్తారని తెలిపారు.
ఇద్దరు లేదా ముగ్గురు ఉండే సెల్లో శశికళ ఉంటారని జైలు అధికారులు తెలిపారు. అందరి ఖైదీలాగే శశికళను ట్రీట్ చేస్తామని స్పష్టం చేశారు. కాగా, శశికళకు ఖైదీనంబర్ 10711 ను జైలు అధికారులు కేటాయించారు. అలాగే ఇళవరసికి ఖైదీనంబర్ 10712ను కేటాయించారు. కాగా, జైలులో శశికళ రోజుకు 50 రూపాయిలు సంపాదించే పనిని జైలు అధికారులు అప్పగించనున్నారు. జైలు అధికారులు వచ్చే ఆదివారం నుంచి శశికళకు పని కేటాయించనున్నారు. జైలులో తాను చేయాల్సిన పనిని ఎంపిక చేసుకునే నిర్ణయాన్ని శశికళకు ఇచ్చారు.
Related