ఉత్తర కొరియా మరో దుస్సాహసానికి ఒడిగట్టింది.ఇప్పటికే కొరియా సరిహద్దరులో తీవ్ర ఉద్రిక్తతలు ఉన్న నేపధ్యంలో కొత్తగా మరో ఖండాతర క్షపణిని ప్రయేగించింది.దీంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు పతాక స్థాయికి చేరాయి.ఇటీవలె దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా మూన్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఈ పరీక్షను నిర్వహించడం పరిస్థితుల్ని మరింత ఖటినతరం చేశాయి.
ప్రస్తుతం ఉత్తరకొరియా ఖండాతర క్షిపణి కుసాంగ్ సమీపంలో పరీక్షను నిర్వహించారు. కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన క్షిపణి జపాన్ సముద్రజలాల్లో కూలిపోవటం గమనార్హం .గతంలో నిర్వహించిన రెడు పరీక్షలు విఫలమయ్యాయి.ఇప్పుడు తాజాగా మూడో పరీక్ష నిర్వహించారు.
ఇప్పుడు పరీక్షించిన క్షిపణి ఏరకానికి చెందినదో క్షిపణో తెలియాల్సి ఉంది. దీనిపై జపాన్ రక్షణ మంత్రి స్పందిస్తూ.. ఉత్తరకొరియా తూర్పుతీరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఈ క్షిపణి కూలిపోయిందని తెలిపారు. ఇది కొత్త శ్రేణికి చెందిన క్షిపణి అని ఆమె తెలిపారు.
{loadmodule mod_custom,Side Ad 1}
దక్షిణకొరియా నూతన అధ్యక్షుడిపై ఒత్తిడి పెంచేందుకే ఈ చర్య తీసుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. మూన్ ఎన్నికల్లో ఉత్తరకొరియాతో సత్సంబంధాలు పెంచుకుంటానని ప్రచారం చేశారు. నేటి పరీక్షను ఆయన ఖండించారు. ఇదో రెచ్చగొట్టే చర్య అని అభివర్ణించారు. ఉత్తర కొరియాతో చర్చలు చేపట్టాలంటే దాని వైఖరిలో కచ్చితంగా మార్పు రావాలని ఆయన అన్నారు.
ఉత్తరకొరియా క్షిపణి పరీక్షను అమెరికా పశ్చిమ కమాండ్ తేలిగ్గా కొట్టిపారేసింది. ఈ క్షిపణికి అమెరికాను భూభాగాన్ని తాకేంత శక్తిలేదని పేర్కొంది. మరో పక్క ఉత్తరకొరియా మిత్ర దేశమైన చైనా ఈ పరీక్షపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read