ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు మంచి పరిపాలన అందించాలని అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు.అయితే జగన్ సమీక్షలను చూసి అధికారులు ఫిదా అవుతున్నారు. గత ప్రభుత్వంలో రివ్యూలంటె చికాకు పడిన అధికారులు ఇప్పుడు జగన్ రివ్యూలతో కుషీ అవుతున్నారు. అధికారులతో ఎక్కువ సేపు రివ్యూలు చేసిన వారి సమయాన్ని వృధా చేయకుండా క్షణాల్లోనె నిర్ణయాలు తీసుకుంటున్నారు కొత్త ముఖ్య మంత్రి. మరో వైపు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మరో సారి రిపీట్ కాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నారు.
జగన్ సమీక్షలపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని.. ఏ విషయమైనా గంటల్లో తేల్చేస్తున్నారని అపార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. జగన్ గారు సమీక్షలు నిర్వహిస్తున్న తీరును అధికారులే మెచ్చుకుంటున్నారని, ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా కాలయాపన లేకుండా గంటల్లోనే తేల్చేస్తున్నారని కితాబిచ్చారు. సమీక్షల కోసం వస్తున్న అధికారుల మధ్యాహ్న భోజనం ముఖ్యమంత్రి గారి నివాసంలోనే ఏర్పాటు చేస్తున్నారని, తన కోసం వండిందే అధికారులకు కూడా పెట్టాలని జగన్ గారు సూచిస్తున్నారని విజయసాయిరెడ్డి వెల్లడించారు.