Friday, March 29, 2024
- Advertisement -

పాకిస్థాన్ లో మన ప్రసార భారతి టాప్.. భారీగా వృద్ధి..!

- Advertisement -

2020లో ప్రసార భారతికి చెందిన డిజిటల్​ ఛానెళ్లు.. 100శాతానికిపైగా వృద్ధిని సాధించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో దూరదర్శన్​, ఏఐఆర్​(ఆల్​ ఇండియా రేడియో) సేవలను అధికంగా ఉపయోగించుకున్న రెండో దేశంగా పాకిస్థాన్​ నిలిచిందని పేర్కొంది.

గతేడాదిలో.. దూరదర్శన్​, ఆకాశవాణి ఛానెళ్లు.. బిలియన్​ డిజిటల్​ వ్యూస్​, 6 బిలియన్​ డిజిటల్​ వాచ్​ మినిట్స్​ను సంపాదించుకున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సేవలను అధికంగా ఉపయోగించుకున్న మొదటి దేశం భారత్​ కాగా.. రెండు, మూడు స్థానాల్లో పాకిస్థాన్​, అమెరికాలు ఉన్నట్టు స్పష్టం చేసింది.

ప్రసార భారతి మొబైల్​ యాప్​ “న్యూస్​ ఆన్​ ఎయిర్​”కు 2020లో 2.5 మిలియన్​ మంది యూజర్స్​ పెరిగారు. మొత్తం మీద 300 మిలియన్​ వ్యూస్​ సంపాదించుకుంది ఈ యాప్​.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -