దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. చిన్నపెద్ద తేడా లేకుండా అందరినీ కరోనా వైరస్ కాటు వేస్తోంది. దీంతో రికార్డు స్థాయిలో నిత్యం కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా దేశంలో ఇదివరకు లేని విధంగా చిన్నారులపై కరోనా పంజా విసురుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
కేవలం ఒక్క మార్చి నెలలోనే దేశంలో దాదాపు 80 వేల మంది చిన్నారులు ఐదు రాష్ట్రాల్లో కరోనా బారినపడటంపై ఆందోళన వ్యక్త మవుతోంది. ప్రభుత్వం ఇదివరకు వెల్లడించిన గణాంకాలు గమనిస్తే.. మార్చి 1 నుంచి ఏప్రిల్ 4 మధ్య కాలంలో దేశంలో 79,688 మంది చిన్నారులు కరోనా బారినపడ్డారని జాతీయ మీడియా పేర్కొంది.
పైన పేర్కొన్న 79,688 మంది చిన్నారులు గణాంకాలు కేవలం ఐదు రాష్ట్రాలకు చెందినవేనని తెలుస్తోంది. ఇందులో మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ లు ఉన్నాయి. ఇందులో అధికంగా మహారాష్ట్రలోని 60,684 ఒక్క నెలలోనే కరోనా బారినపడగా, అందులో 9,882 మంది చిన్నారులు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన వారున్నారు.
సూపర్ స్టార్ మహేశ్ నెక్స్ట్ మూవీ ఆయనతోనేనా !
‘వకీల్ సాబ్’ హీరోయిన్ కు కరోనా
ఢిల్లీని వీడుతున్న ప్రజలు.. ఎందుకంటే..?