Saturday, April 20, 2024
- Advertisement -

రెండు డోసులు తీసుకున్న 40 డాక్ట‌ర్ల‌కు క‌రోనా

- Advertisement -

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి పంజా విసురుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. అయితే, క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా మ‌ళ్లీ వైర‌స్ బారిన‌ప‌డుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ‌రీ ముఖ్యంగా రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు సైతం మ‌ళ్లీ పాజిటివ్‌గా ప‌రీక్షించ‌బ‌డ‌టం.. ఆస్పత్రి పాల‌వుతుండ‌టంతో సామాన్య జ‌నం భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న 40 మంది డాక్ట‌ర్లు క‌రోనా బారిన‌ప‌డ్డారు. వివ‌రాల్లోకెళ్తే.. ల‌క్నోలోని కింగ్ జార్జ్ మెడిక‌ల్ యూనివ‌ర్సిటీ (కేజీఏంయూ) చెందిన ప‌లువురు వైద్యులు క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఇందులో 40 మంది డాక్ట‌ర్లు ఇప్పటికే రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ల‌ను తీసుకున్నారు. వీరిలో యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స్ ల‌ర్ డాక్ట‌ర్ విపిన్ పూరి కూడా ఉన్నారు.

గ‌త ఆగ‌స్టులో వైస్ ఛాన్స్ ల‌ర్ క‌రోనా బారిన‌ప‌డ్డారు. తాజాగా టీకా తీసుకున్న త‌ర్వాత కూడా వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఈ 40 మంది వైద్యుల‌లో సాధారణ శస్త్రచికిత్స విభాగానికి చెందిన 20 మంది, యూరాలజీ విభాగానికి చెందిన తొమ్మిది మంది, వైద్య శాఖ నుంచి ముగ్గురు డాక్ట‌ర్లు ఉన్నారు. వర్సిటీలోని సిబ్బంది అందరికీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ననీ, త్వరలోనే రిపోర్టులు వస్తాయని యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది.

మారుతి డైరెక్ష‌న్‌లో రవితేజ మూవీ !

ఈ ‘పుడింగి నెంబర్ 1’ ఆ ఇద్ద‌రితో ఏం చేస్తాడో మ‌రి !

జింద‌గీ కొత్తగా న‌వ్వుతోందంటున్న’ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’

తెలుగువారు గర్వించదగ్గ మూవీ ఇది: మెగాస్టార్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఓ ట్రెండ్ సెట్ట‌ర్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -