- Advertisement -
నిన్నటికి నిన్న తిరుపతి చేరుకొని హత్యకి గురైన తన ఫ్యాన్ వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్ కాసేపటికి తిరుమల లో శ్రీవారిని దర్శించుకున్నారు. లైన్ లోనే సమాన్యుడిలాగా నిలబడిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రేపు సాయంత్రం జన సేన ప్రోగ్రాం ని తిరుపతి లో ప్లాన్ చేస్తున్నారు.
రేపు సాయంత్రం తిరపతి లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ సభలో పవన్ ఏమి మాట్లాడబోతున్నారు అనేది ఇప్పుడు అందరి మనసులనూ తొలిల్చేస్తున్న ప్రశ్నగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఇప్పుడు పవన్ మాట్లాడటానికి ఉన్న విషయాలన్నీ హాట్ టాపిక్స్ మాత్రమే కాకుండా రాజకీయాల్లోనూ పెను సంచలనాలు తీసుకువచ్చేవిగా ప్రజలు భావించడమే.
Related