Saturday, April 20, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ ఏపీ ని గాలికి వదిలేసాడు !

- Advertisement -
Pawan kalyan Target BJP with His Tweets

రోజుకొక విషయం మీద సోషల్ మీడియా ట్విట్టర్ లో మాట్లాడతాను అని చెప్పిన హీరో పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ట్విట్టర్ లో తాను చెప్పాలి అనుకున్న విషయాన్ని చెప్పి మిన్నక ఉంటున్నాడు ఈ జనసేన అధ్యక్షుడు.

ఐదారు రోజుల క్రితం ట్వీట్లు చేసి.. తాను కొన్ని అంశాల మీద సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానన్న ఆయన.. అందుకు తగ్గట్లే ట్వీట్లు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీని ఇచ్చిన బీజేపీ నేతలకు తన ట్వీట్లతో చురుకు పుట్టించిన పవన్..ఇవాళ ఏ  అంశం మీద ట్వీట్లు చేసే విషయాన్ని తాజాగా వెల్లడించాడు.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పాటు.. బంగారం మీద కేంద్రం పరిమితులు పెడుతున్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ అంశాల మీద తన అభిప్రాయాల్ని పోస్ట్ చేస్తానని పవన్ వెల్లడించారు. అయితే ట్విట్టర్ లో మాత్రమే కళ్యాణ్ మాట్లాడుతున్నాడు అనీ బయట నోరు మెదపడం లేదు అనీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాను అని మాట ఇచ్చిన కళ్యణ్ ఇప్పుడు సినిమాలలో బిజీ అయ్యి ఆ మాటని గాలికి వదిలేసాడు అనీ విమర్శలు వస్తున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -