విశాఖ ఎయిర్పోర్ట్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్ రెడ్డిపై విమానాశ్రాయంలో దాడి జరిగింది. శుక్రవారం కోర్టు కేసుకు హాజరయ్యేందుకు హైదరాబాద్ బయలుదేరిన జగన్… విమానం కోసం ఎయిర్ పోర్ట్ లాంజ్లో కూర్చున్న జగన్ వద్దకు వచ్చి న శ్రీనివాస్ అనే వ్యక్తి పందెం కోళ్లకు కట్టే చిన్న సైజు కత్తితో ఈ దాడి చేసినవిషయం తెలిసిందే. శ్రీనివాస్ ఎయిర్ పోర్ట్ క్యాంటీన్లో వెయిటర్గా పని చేస్తున్నారు.
అయితే జగన్పై దాడికి పక్కాప్లాన్ ఉన్నట్లుగా పలు అనుమానాలను కలిగిస్తోంది. అత్యంత సెక్యూరిటీ ఉన్న ఎయిర్పోర్ట్లోకి కత్తితో ఎలా ప్రవేశించాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే శంశాబాద్ ఏయిర్పోర్ట్లో అనుమానితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు …..దీంతో పక్కా దాడికి మరింత బలం చేకూరినట్టుంది. దీని వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోందని పార్టీనేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఏయిర్పోర్ట్లో మిస్ అయితే శంశాబాద్ ఎయిర్పోర్టులో దాడి చేయడానికి ప్లాన్ వేశారనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
విశాఖ ఏయిర్పోర్ట్లో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్కు జగన్ బయల్దేరారు. అయితే శంశాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ వ్యక్తి అనుమానంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీలసు అదుపులోకి తీసుకున్నారు. అతను అక్కడ ఎందుకున్నారు అనే కోనంలో పోలీసులు విచారిస్తున్నారు. ఏది ఏమయినా పోలీసు విచారణలో నిజాలు నిగ్గుతేలనున్నాయా..?