- Advertisement -
తెలంగాణ సిఎం కేసిఆర్పై టిడిపి అధినేత తనయుడు నారాలోకేశ్ కొద్ది రోజుల క్రితం విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఢిల్లీ రాజకీయాలు చేస్తే కేసిఆర్ గల్లీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
దీనిపై నారా లోకేశ్ మీద బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు నమోదైంది.
కొందరు తెలంగాణ న్యాయవాదులు లోకేశ్పై పిర్యాదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోకేశ్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.