- Advertisement -
అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, వీహెచ్పీ ప్రతినిధులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. ఆలయ నిర్మాణ విరాళల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన క్రమంలో రాష్ట్రపతిని కలిసినట్లు తెలిపారు ట్రస్ట్ సభ్యులు. ఈ సందర్భంగా.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రామమందిరానికి రూ. 5,00,100 విరాళం అందించినట్లు తెలిపారు.
ఫిబ్రవరి 27 వరకు దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించనున్నారు. విరాళాల సేకరణ కోసం రూ.10 కూపన్లు 4 కోట్లు, రూ.100 కూపన్లు 8 కోట్లు, రూ.1000 కూపన్లు 12 లక్షలు ముద్రించింది ట్రస్ట్.