వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలవనుంది రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం. డిసెంబర్ 24న కలిసి.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2 లక్షల మంది సంతకాలు చేసిన మెమోరాండంను ఆయనకు సమర్పించనున్నారు. రాహుల్ అధ్యక్షతన కాంగ్రెస్ ఎంపీలు, ఇతర నాయకులు రాష్ట్రపతిని కలిసి ఈ వినతిపత్రాన్ని సమర్పించడంతో పాటు, ప్రజాసంక్షేమం దృష్ట్యా ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని కోరనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. 3 వ్యవసాయ చట్టాలు రైతులకు తీవ్ర వేదన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
కేంద్రం తెచ్చిన చట్టాల రద్దులో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని, సెప్టెంబర్ నుంచి కాంగ్రెస్ సంతకాల సేకరణ మొదలుపెట్టింది. కూలీలు, రైతులు, వ్యాపారుల నుంచి మొత్తం 2 కోట్లకుపైగా సంతకాలు సేకరించింది.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోట్లేదని, ఇప్పటికే 44 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.