- Advertisement -
కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఢిల్లీలోని ఎయిమ్స్లో వ్యాక్సిన్ వేయించుకున్నారు. పుదుచ్చేరికి చెందిన నర్సు పీ నివేద, పంజాబ్కు చెందిన నిషా శర్మలు టీకా అందించారు.మార్చి 1న భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా తొలి డోసు తీసుకున్నారు మోదీ. మొదటి డోసును ఇచ్చిన నర్సుల బృందంలోనూ.. పుదుచ్చేరికి చెందిన నివేదా ఉన్నారు.
ప్రధాని మోదీని రెండోసారి కలిసేందుకు అవకాశం రావటం చాలా సంతోషంగా ఉందన్నారు నర్సు పీ నివేద. ‘ ప్రధాని మోదీకి కొవాగ్జిన్ తొలి డోసు ఇచ్చింది నేనే. మరోమారు ఆయన్ని కలుసుకునేందుకు, రెండోసారి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవకాశం లభించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మాతో మాట్లాడారు. కొన్ని ఫొటోలు కూడా తీసుకున్నాం. ‘ అని తెలిపారు నివేద.
నేటి పంచాంగం,గురువారం(8-4-2021)