ఆంధ్రప్రదేశ్లో వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. సార్వత్రిక ఎన్నికల తర్వాత.. టీడీపీకి గుడ్ బై చెప్పి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు చెందిన నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా టీడీపీకి మరో షాక్ తగిలింది.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను కలిసిన బాపట్ల మాజీ ఎమ్మెల్యే మంతెన అనంత వర్మ.. సీఎం జగన్ సమక్షంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువ కప్పుకున్నారు. ఆయనతో పాటు టీడీపీ నేతలు మంతెన సుబ్బరాజు, వి. వెంకటేశ్వరరాజు, ఎం.వి. సర్వేశ్వర యాదవ్, పృద్వీరాజు, మంతెన నాగరాజు, బాపూజీ, మోదుగుల వెంకటరెడ్డి వైయస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి పాల్గొన్నారు.
కన్నీరు పెట్టుకున్న లేడీ కమెడియన్!
తిరుపతి ప్రచారానికి సీఎం జగన్ సిద్దం.. ఏర్పాట్లలో నేతలు బిజీ బిజీ!