Tuesday, May 14, 2024
- Advertisement -

ప్రియాంక చంపిన నా కొడుకుని చంపేయండి : చెన్నకేశవులు తల్లి

- Advertisement -

షాద్ నగర్ ప్రియాంక హత్య కేసు నిందితులను ఉద్దేశించి.. వాళ్లను చంపేయండి అని ఇప్పుడు దేశ వ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తుంది. డాక్టర్ ప్రియాంకా రెడ్డిని అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేసి.. ఆమెను కాల్చి చంపిన ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశం పరువు పోయే పరిస్థితి వచ్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నిందితులను వెంటనే చంపాలంటూ బాలికలు అందరూ రెండు తెలంగాణ రాష్ట్రాల్లో ర్యాలీలు చేస్తున్నారు.

ఇక నిందితులను తమకు అప్పజెప్పాలని షాద్ నగర్ లో స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆ నలుగురు నిందితుల కుటుంబాలు తన పిల్లలు తప్పు చేస్తే ఏ శిక్ష అయిన వెయండి అంటున్నారు. నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు తల్లి జయమ్మ మీడియాతో మాట్లాడారు. ప్రియాంకను ఏ విధంగా అయితే చంపారో తన కొడుకుని కూడా అదే విధంగా చంపాలని ఆమె డిమాండ్ చేశారు. తన కొడుకు ఇలాంటి పని చేశాడని తెలిసి తన భర్త ఆత్మహత్యకు ప్రయత్నించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక ఆరిఫ్ లారి పాడైందని తన కొడుకుని తీసుకెళ్లాడని.. ఆరిఫ్ తో స్నేహం వల్లే తన కొడుకు పాడైపోయాడని ఆమె చెప్పింది. ప్రేమ పెళ్లి చేసుకున్నా సరే తాము ఏమి అనలేదని.. కిడ్ని పాడైందని.. ఏ పని చెప్పట్లేదని తెలిపింది. ఇప్పుడు ఊరు అంతా తమ గురించే మాట్లాడుకుంటున్నారని.. ఉరి వేయండి లేదా కాల్చి చంపడి అని ఆమె మీడియాతో చెప్పారు. ఇక మిగిలిన ముగ్గురు నిందితుల తల్లిదండ్రులు కూడా వాళ్లను చంపాలని కోరుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -