Saturday, April 27, 2024
- Advertisement -

భగ్గుమన్న అనంతపురం..టీడీపీ ఆఫీస్ దగ్దం!

- Advertisement -

టీడీపీ ఫైనల్ జాబితా రిలీజ్ అయింది. 9 అసెంబ్లీ, 4 ఎంపీ అభ్యర్థులతో కూడిన ఫైనల్ లిస్ట్‌ను రిలీజ్ చేయగా అసమ్మతి భగ్గుమంది. అనంతపురం టికెట్ ఆశీంచిన ప్రభాకర్ చౌదరికి భంగపాటు తప్పలేదు. దీంతో ఆయన వర్గీయులు టీడీపీ ఆఫీస్‌ను ధ్వంసం చేశారు. డబ్బులకు పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

టికెట్ దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌కు డబ్బులకు అమ్ముకున్నారని మండిపడుతూ… టీడీపీ ఆఫీసులోని ఫర్నీచర్,కుర్చీలు పగలగొట్టారు. ఆఫీస్ బయట ఫర్నీచర్‌ను తగలబెట్టి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని ప్రభాకర్ చౌదరిపై ఒత్తిడి తెస్తున్నారు ఆయన వర్గీయులు. దీంతో చంద్రబాబుకు షాక్‌కు గట్టి షాక్ తగిలింది.

విశాఖ జిల్లా భీమిలీ నుండి మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస్ , గంటా శ్రీనివాస్ మధ్య పోరు జరగనుంది. ఇద్దరికి భీమిలి సెంటిమెంట్ గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -