హైదరాబాద్: సొంతంగా జనసేన పార్టీ పెట్టి ప్రజల్లోకి చొచ్చుకెళుతున్న పవన్ కళ్యాణ్కు రానున్న రోజుల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశముందా?
తాను రాజకీయాల్లో పరిస్థితులపై, కావాల్సిన సపోర్ట్పై ఆలోచించాల్సిందేనేమో. ముఖ్యంగా మీడియాలో తన వార్తలు రావాల్సిన అవసరం ఉందనేది ఓ వాదన. జనాల్లో నిత్యం నిలవాలంటే తన ఉద్దేశాలు, అభిప్రాయాలు జనాల్లోకి వెళ్లాలంటే అవి మీడియాలో ప్రచారం పొందాల్సిందే. కానీ అలా ఎంతవరకు జరుగుతుందో చూడాలి.
అయితే ఆదివారం మొదటిసారిగా పవన్ కళ్యాణ్ నోట్ల రద్దుపై స్పందించారు. ట్విట్టర్లో తన అభిప్రాయాలను వెల్లడించాడు. తన స్నేహితుడు సాయిమాధవ్ రాసిన కవితను కూడా షేర్ చేశారు. అయితే ఈ విషయం మాత్రం మీడియాలో అంతగా చోటు దక్కించుకోలేదు. కొన్ని వార్తా పత్రికల్లో అయితే ఎక్కడో లోపల ప్రచురించారు. రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఉండేందుకు సిద్దమైన పవన్కు ఈ మీడియా మానేజ్మెంట్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉందనేది సోషల్ మీడియాలో చర్చ. అనుకూల వార్తలు ఓ విధంగా, వ్యతిరేక వార్తలు మరో విధంగా ప్రచురించడం మీడియాకు ఓ అలవాటుగా మారిందనే వాదన ఎప్పటి నుంచో ఉన్నదే.