- Advertisement -
బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ కొవిడ్ టీకా తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించాయి. బకింగ్హమ్ ప్యాలెస్లో వైద్యుల పర్యవేక్షణలో దంపతులు వ్యాక్సిన్ తీసుకున్నట్టు తెలిపాయి.ఊహాగానాలకు తెరదించేలా తాను వ్యాక్సిన్ తీసుకున్నట్లు అందరికీ తెలపాలని రాణి ఎలిజబెత్ చెప్పినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. బ్రిటన్లో ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల మంది కొవిడ్ టీకా మొదటి డోసు తీసుకున్నారు.
భారత్ సామర్థ్యాన్ని అయిష్టంగానే అంగీకరించింది చైనా. తాము తయారు చేసిన టీకాలకు భారత్ వ్యాక్సిన్లలు ఏ మాత్రం తీసిపోవని.. టీకాల తయారీలో భారత్కు ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదన సామర్థ్యం ఉందని అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్లో పేర్కొంది.