Sunday, May 12, 2024
- Advertisement -

వామ్మో.. బాబు ఫ్యామిలీకి అన్ని కమిషన్లే!

- Advertisement -

ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆసక్తికరమైన ఆరోపణలు చేశాడు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని, బాబు తనయుడు లోకేష్ ను టార్గెట్ గా చేసుకొని రఘువీరారెడ్డి మీడియా ముందుకు వచ్చాడు.

 వారిపై పెద్ద పెద్ద ఆరోపణలే చేశాడు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాకా కమిషన్ల రాజ్యం నడుస్తోందని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించాడు.

ఈ సందర్భంగా బిగ బాస్, చిన్న బాస్ అంటూ రఘువీరారెడ్డి కొత్త పదబంధాలను తీసుకురావడం విశేషం. ఏపీలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి. .పెద్ద బాస్ చిన్న బాస్ లకు లంచాలు అందుతున్నాయని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించాడు. 

ఇప్పటి వరకూఏపీ ప్రభుత్వం చిన్న పరిశ్రమలకు ఇచ్చిన రాయితీల గురించి ప్రస్తావిస్తూ రఘువీరారెడ్డి ఐదొందల కోట్ల రూపాయల డబ్బు అందిందని.. ఆరోపణ చేశాడు. మొత్తం 1,400 కోట్ల రూపాయల సబ్సీడీని ఇచ్చారని.. ఇందులో ఐదొందల కోట్ల రూపాయల ముడుపులు అందాయని రఘువీరా అంటున్నాడు.

పట్టిసీమ పేరుతో ఐదొందల కోట్ల రూపాయల కొల్లగొట్టే ప్లాన్ ఒకటుంటుందని రఘువీరా అంటున్నాడు.  కరెంటు కొనుగోలులో కూడా అక్రమాలు జరుగుతున్నాయని రఘువీరా ఆరోపించాడు. ప్రతి యూనిట్ కూ పాతిక పైసల కమిషన్ అందుతోంందని ఆయన అంటున్నాడు.

ఈ విషయాలపై విచారణ జరిపించాలని కూడా ఈయన డిమాండ్ చేశాడు. మరి ఇంకా బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొంత కాలమే అయ్యింది. మరి అప్పుడే ఆరోపణలు చేసి విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత డిమాండ్ చేస్తే.. అది జరిగిపోతుందా?!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -