- Advertisement -
ఎన్నాళ్ల నుంచో అపరిష్కతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11 నుంచి దేశవ్యాప్త సమ్మె చేయాలని నిర్ణయించినట్లు అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య నిర్ణయించింది.
దీనికి సంబంధించి ఈ నెల 9 వతేదిన దేశంలోని అన్ని రైల్వే జోన్ల మేనేజర్లు, ప్రొడక్షన్ యూనిట్ల అధికారులు, జనరల్ మేనేజర్లకు నోటీసులు ఇవ్వనున్నామని ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య ప్రకటించారు. ఇంతకు ముందు ఏడో వేతన సంఘం చేసిన సిఫార్సులను తిరస్కరించాలని, ఉద్యోగులకు కనీస వేతనాన్ని 26 వేల రూపాయలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.