వివాహ వేడుకల్లో మనకు తెలిసి నార్త్ సైడ్ భరాత్ గట్టిగా చేస్తారు. ఫ్యామిళీ బ్యాక్ గ్రౌండ్ పెద్దగా ఉన్నట్లయితే… పచ్చనోట్లను వెదజల్లుతారు. ఏమైనా అంటే అది మా ప్రెస్టీజియస్ ఇష్యూ అంటూ సంబోదిస్తారు.దీంతో పోలీసులు కూడా ఈ తరహా వివాహాలు,ఊరేగింపుల విషయంలో కామ్ గా కూర్చుంటారు. ఇలాంటి వేడుకల్లో కళాకారులపై డబ్బులు వెదజల్లడమూ గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కామనే. కానీ పెండ్లికి వచ్చిన అతిథులతోపాటు వేడుక జరిగిన ఊరు ఊరందరిపైనా డబ్బులు, మొబైల్ఫోన్లు వర్షంలా కురిపించడం మీరెక్కడైనా చూశారా.
పాకిస్థాన్ లో మాత్రం ఇలాంటి సీన్లను మీరు చూడొచ్చు. మ్యారీజ్ కొచ్చిన వారిని ఎదురుగా రమ్మని ఓ గోడ ఎక్కి… ప్రతిఒక్కరిపై మొబైల్ఫోనో, డాలర్ , రియాల్ కరెన్సీ లను చల్లారు. పాకిస్తాన్లో జరిగిన ఈ తరహా వేడుక దృశ్యాలు ఇంటర్నెట్లో ఎంతగానో వైరల్ అయ్యాయి.ఈ మ్యారీజ్ కు సంబంధించిన విషయాలకు వెళితే… ఆ సదరు వివాహానికి చెందిన వరుడు చాలా ధనవంతుడు అని తేలింది. ముల్తాన్లోని షుజాబాద్కు చెందిన మొహమ్మద్ అర్షద్కు.. పంజాబ్ ఫ్రావిన్స్లోని ఖన్పూర్కు చెందిన ఓ ముద్దుగుమ్మతో నిఖా అయింది.
వరుడు అర్హద్కు ఎనిమిది మంది అన్నయ్యలున్నారట. వారంతా అమెరికా, సౌదీ అరేబియాలలో రకరకాల ప్రాంతాలలో స్థిరపడి సూపర్బ్ గా సంపాదించారు.తమ చివరి తమ్ముడి పెళ్లి అందరికీ గుర్తుండాలనే ఆలోచనలో వారు ఈ ధనాన్ని,సెల్ ఫోన్లను చల్లడమనే కార్యక్రమాన్ని ఇలా షురూ చేశారు. బహుశ ఈ అన్నదమ్ములకు వీరు చేసిన పని ప్రపంచ వ్యాప్తంగా ఇంతలా వైరల్ అవుతుందని ఊహించి ఉండరు. మొత్తానికి ఏదో అలా జరిగిపోయింది.