రవీంద్ర జడేజా ఇండియా క్రికెట్ కీలక ఆటగాడు.ఆల్రౌండర్గా తన ముద్ర వేసుకొని టీంలో రెగ్యులర్గా సభ్యుడిగా మారాడు జడేజా.మొన్న ఆ మధ్య ఒక అభిమాని వచ్చి బాగా బౌలింగ్ చేశావు అజయ్ జడేజా అనే సరికి ఖంగు తిన్న జడ్డు భాయ్ అసహనాన్ని ట్వీట్టర్లో పోస్టు చేశాడు.దీని పై నెటిజన్లు జడేజాపై తిట్ల దండకం మొదలెట్టారు.ఏదో అభిమాని తెలియక అంటే ఇలా పబ్లిక్ చేయాలా అని వారు విరుచుకుపడ్డారు.
ఇప్పుడు రవీంద్ర జడేజా తన ఇన్స్టాగ్రాంలో ఓ ఫొటో పోస్ట్ చేయడం ద్వార అనేక విమర్శలు ఎదుర్కుంటున్నాడు.ఇంతకి ఆ ఫోటో లో ఏముంది అంటే రవీంద్ర జడేజా ఫామ్హౌస్లో సేద తీరుతూ, హుక్కా తాగుతున్న ఫొటో. ఈ ఫోటో పెట్టడం తో నెటిజన్లు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు.ఓ సెలబ్రిటీ అయి ఉండి ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన వారు ఇలా వ్యవహరించడం చాల బాధాకరమని అన్నారు.
చిన్నారులు జడేజాను ఆదర్శంగా తీసుకుంటున్నారని, ఇలాంటి ఫొటోలు పెట్టడం కారణంగా వారు అడ్డదారులు తొక్కే అవకాశాలున్నాయని హితబోధ చేశారు.మరికొంతమంది నెటిజన్లు జడేజా కి మద్దతు నిలిచారు సెలబ్రిటీ లు కూడా స్వేఛ్చ ఉంటుంది అని వారు కూడా మనలాగే మనుషులే అని వారిజీవితాన్ని వారికి నచ్చిన విధంగా అనుభవించే హక్కు వారికి ఉందని మద్దతిచ్చారు.బీసిసిఐ దీని పై ఎలా స్పదింస్తుందో చూడాలి.