హైదరాబాద్: పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. అంతా చాలా నమ్మకస్తులుగా భావించే వారు సైతం కక్కుర్తి పడుతున్నారు.
ఊరికే వచ్చే డబ్బు కోసం ఎగబడుతున్నారు. ప్రజలంతా బ్యాంకుల చుట్టూ పరిగెడుతూ చేతిలో చిల్లర లేక ఇబ్బంది పడుతున్నారు. బ్యాకుల ముందు భారీ లైన్ ఉంటుంది. దీంతో పాటు లెక్కా పత్రం లేని నల్ల డబ్బును మార్చుకోవడం కూడా కొందరికి కష్టంగా మరింది. దీంతో ఇలా ఎవరు ఇబ్బంది పడతారు గానీ లైన్లో నుంచోకుండా పనయ్యే అవకాశాలేమైనా ఉన్నాయా అంటూ ఎక్కడ అవకాశముంటే అక్కడ పని కానిచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే బ్యాంకు మేనేజర్లు, ఉద్యోగులతో కమీషన్లు మాట్లాడుకుని హమ్మయ్యా అనుకుంటున్నారు. అంతే కాకుండా దేవాలయాలనూ వదలడంలేదు. దేవాలయ ఉద్యోగులతో కూడా కమీషన్లు మాట్లాడుకుని రద్దయిన నోట్ల స్థానంలో చిల్లర తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లేమో వాటిని హెండీ డబ్బులతో కలిపేస్తున్నారు. తాజాగా కర్నూల్లోని మహానందీశ్వరాలయంలో ఇలాంటి పనే చేస్తున్న ఆలయ ఉద్యోగులు బండారం బయటపడింది. దీంతో వీరిపై తగిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దమయ్యారు.