Thursday, May 2, 2024
- Advertisement -

అమ్మ బుగ్గపై గాట్లు ఎలా పడ్డాయో చెప్పేసిన డాక్టర్లు..!!

- Advertisement -
Reason behind Holes on Jayalalitha Face

తమిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్ప‌త్రిలో చేరి మృతి చెందిన సంగతి తెలిసిందే. అమ్మ  హార్ట్ స్ట్రోక్ తో మరణించారని ప్రకటించినా ఆమె మరణంపై అన్నీ అనుమానాలే. ఆ అనుమానాలకి తగ్గట్లే ఆమె బుగ్గపై గాట్లు కూడా ఉన్నాయి.

అయితే ఆమెకు చికిత్స చేసిన అపోలో ఆస్ప‌త్రి వైద్యులు మాత్రం ఈ విష‌యం గురించి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. కాగా త‌మిళనాడులో తాజాగా చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో అపోలో ఆస్ప‌త్రి వ‌ర్గాలు  ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ జ‌య‌ల‌లిత ఎలా చ‌నిపోయిందో వెల్ల‌డించారు. ఈ ప్రెస్ మీట్ లో అమ్మకు చికిత్స చేసిన రిచ‌ర్డ్ బాలే కూడ ఉన్నారు.  మ‌ద్రాస్ మెడిక‌ల్ కాలేజీ అనాట‌మీ విభాగం డైరెక్ట‌ర్ సుధా శేష‌య్య‌న్.. అమ్మ బుగ్గపై ఉన్న గాట్ల‌కు స‌మాధానం చెప్పారు.

జ‌య‌ల‌లిత శ‌రీరం ఎక్కువ రోజులు పాడ‌వ‌కుండా ఉండేందుకే ఆమెకు ఎంబాల్మింగ్ చేశామ‌ని, అందుకు 15 నిమిషాలు ప‌ట్టింద‌ని, గ‌తంలో ఎంజీఆర్‌ కు కూడా తాము  ఇలానే  చేశామ‌ని వివరించారు. దీంతో అమ్మ ముందే చ‌నిపోయార‌న్న విష‌యం స్ప‌ష్టంగా రుజువైన‌ట్టేనని అమ్మ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -