Sunday, May 19, 2024
- Advertisement -

జియో రూ.49 ఆఫర్‌పై మరో గుడ్ న్యూస్…

- Advertisement -

ఉచిత మంత్రంతో టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని రీతిలో వినియోగదారులను సొంతం చేసుకున్న రిలయన్స్ జియో.. ఎప్ప‌టిక‌ప్పుడు అద్భుతమైన ఆఫర్లు తీసుకొస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. తాజాగా జియో ప్రకటించిన రూ.49 ప్లాన్ కస్టమర్లను కాస్త అయోమయానికి గురి చేస్తోంది. ఈ ప్లాన్‌తో 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ వాయిస్‌ కాల్స్‌తో పాటు 1 జీబీ డేటాను వాడుకోవచ్చని ఇటీవలే ఆ కంపెనీ పేర్కొంది. అయితే, ఈ ప్లాన్‌ను జియో ఫోన్‌లో మాత్రమే ఉపయోగించుకోవచ్చని కొందరు వినియోగదారులు అనుకుంటున్నారు. కానీ, ఇతర కంపెనీల 4జీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కూడా ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు.

మొదట జియో సిమ్‌ను జియోఫోన్‌లో వేసుకోని రూ.49 ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా యాక్టివేట్‌ చేసుకున్న తరువాత ఆ సిమ్‌ను బయటికి తీసి, ఇతర స్మార్ట్‌ఫోన్‌లో వేసుకుంటే ఈ ప్లాన్ యాక్టివేట్‌లోనే ఉంటుంది. జియోఫోన్‌లో మాత్రమే ఈ ప్లాన్‌ను వాడుకోవాలనే నిబంధనను సదరు కంపెనీ పెట్టలేదు.

ఒక్క మాటలో చెప్పాలంటే రూ.49 ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవాడానికి జియో సిమ్ కార్డును జియో ఫోనులో వేసి, యాక్టివేట్ చేసుకుని, మళ్లీ మీ ఇతర స్మార్ట్‌ఫోనులో వేసుకోవాలి. అంతేకాదు, జియో అందిస్తోన్న రూ.153 ప్లాన్‌ను కూడా ఇదే విధంగా యాక్టివేట్ చేసుకుని ఏ స్మార్ట్‌ఫోన్‌లోనైనా వాడుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -