Monday, May 6, 2024
- Advertisement -

ఐపీఎల్ మ్యాచ్‌ల‌కోసం బంఫ‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన‌ బీఎస్ఎన్ఎల్..

- Advertisement -

ఐపీఎల్ మ్యాచ్‌ల‌కోసం క‌ష్ట‌మ‌ర్ల‌కు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ బీఎస్ఎన్ఎల్ బంఫ‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఐపీఎల్ సీజన్ కావడంతో జియోకు దీటుగా రూ.248 ప్రీపెయిడ్ పథకాన్ని తాజాగా ప్రకటించింది. 51 రోజుల పాటు అమల్లో ఉండే ఈ రీచార్జ్ ప్లాన్ లో 153 జీబీ డేటాను వాడుకోవచ్చు. అంటే రోజూ 23జీబీ డేటా పరిమితి ఉంటుంది.

కొత్త ఆఫ‌ర్ వ‌ల్ల దీనివల్ల చందాదారులు ఐపీఎల్ మ్యాచులను లైవ్ స్ట్రీమ్ చేస్తూ చూసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. రిలయన్స్ జియో రూ.258 ప్లాన్ ను ఐపీఎల్ సీజన్ కోసం ప్రకటించిన విషయం తెలిసే ఉంటుంది. ఈ ప్లాన్ లో రోజూ 2 జీబీ డేటా చొప్పున 51 రోజుల పాటు 102 జీబీను వాడుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ ఇంకాస్త చొరవ తీసుకుని జియో కంటే రోజూ 1జీబీ అదనపు డేటాను ఆఫర్ చేసింది.

బీఎస్ఎన్ఎల్ తాజా పథకం ఈ నెల 7 నుంచి ఏప్రిల్ 30 వరకు అంటే ఐపీఎల్ మ్యాచ్ లు ముగిసేంత వరకు అమల్లో ఉంటుంది. అయితే, జియో 4జీ సర్వీసులు అందిస్తుండగా, బీఎస్ఎన్ఎల్ 3జీ సర్వీసుల్లో ఉన్న విషయం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -