- Advertisement -
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ ఒకే జిల్లాలో పర్యటించారు. రేణూ దేశాయ్ పర్యటన వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని వస్తున్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు.
రైతుల కష్టాలపై కార్యక్రమం చేయాలని చాలా ముందుగానే అనుకొని పర్యటన సిద్ధం చేసుకున్నామని.. అందులో భాగంగానే కర్నూలుకు వెళ్లానన్నారు. అదే సమయంలో పవన్ కూడా కర్నూల్ వచ్చారని.. ఆయనొచ్చారని రైతుల సమస్యలపై ఎన్నో సంవత్సరాలుగా ప్లాన్ చేసుకున్న కార్యక్రమాన్ని వాయిదా వేసుకోలేను కదా రేణు తెలిపింది.
పవన్ స్థానంలో వేరే ఏ నేత ఉన్నా ఇదే చేసేదానినని క్లారిటీ ఇచ్చింది. అంతేకానీ కర్నూలు టూర్లో ఎలాంటి రాజకీయాల్లేవని రేణూ దేశాయ్ స్పష్టం చేసింది. బుద్ధి లేని మూర్ఖులకే ఎంత చెప్పినా బుర్రకెక్కలేదని.. ఇకనైనా ట్రోల్ చేయడం ఆపాలని కోరింది.