Sunday, May 19, 2024
- Advertisement -

తెలంగాణా కి ద్రోహం !

- Advertisement -

తెలంగాణా రాష్ట్రం లో అంపశయ్య మీద ఉన్న తెలుగుదేశం పార్టీ కి ఒకే ఒక్క ఆధారం గా మారాడు రేవంత్ రెడ్డి. ఓటు కు నోటు కేసులో అడ్డంగా ఇరుక్కుపోయి జైలుకి వెళ్లి బైలు మీద బయటకి వచ్చినా కూడా రేవంత్ ఇంకా తెరాస కీ తెలంగాణా ప్రభుత్వానికీ వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నాడు.

అక్కడి మీడియా అతనికి అంతగా హైప్ ఇవ్వకపోయినా కూడా కెసిఆర్ తీరుని వ్యతిరేకిస్తూ అతని పోరాటం సాగుతూనే ఉంది. ప్రస్తుతం మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా గళం విప్పిన రేవంత్ రెడ్డి , విపక్షాలతో కలిసి దీక్ష చెయ్యడం కోసం గజ్వేల్ చేరుకున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ వలన దాదాపు నాలుగు వేల గ్రామాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉన్నా కూడా తెలంగణా సర్కారు ఏ రకంగా దీన్ని ఓకే చెబుతోంది అంటూ ఆయన మండి పడ్డారు.

పేదల కడుపు కొట్టి.. జేబులు నింపుకోవటానికే మల్లన్నసాగర్ నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన మామా.. అల్లుళ్లు ఆంధ్రా కాంట్రాక్టర్లతో అక్రమ సంపాదనకు పాల్పడుతున్నట్లుగా దుయ్యబట్టారు. ప్రాజెక్ట్ నిర్మానానికి ప్రజలు వ్యతిరేకిస్తున్నా.. మంత్రి హరీశ్ మాత్రం అక్కడి రైతుల్ని బెదిరించటాన్ని ఆయన తప్పు పట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -