Monday, May 6, 2024
- Advertisement -

టీవి 9 ఛానెల్ పై కేసు పెడుతున్న రామ్ గోపాల్ వర్మ

- Advertisement -

వివాదాల ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ మ‌రో వివాదానికి తెర లేపాడు.ఈసారి త‌న స్ట్రాటజీని మార్చారు.మహిళా సంఘాల ఫిర్యాదుతో లీగల్ గా ఇబ్బందుల్లో పడ్డ రామ్ గోపాల్ వర్మ,తెలుగులో ప్రముఖ ఛానెల్ టీవీ9పై ఓ రేంజ్‌లో ఫైరవుతూ తాను ఛానల్‌‌పై కేసులు పెట్టే పనిలో ఉన్నానని తన లాయర్లు ఈ వ్యవహారానికి సంబంధించిన అంశాలను సేకరించే పనిలో ఉన్నారన్నారు.ఈ మేరకు, తన న్యాయవాదులు అన్ని ఆధారాలను సేకరిస్తున్నారని, కేసు పెట్టడం ఖాయమని వర్మ వ్యాఖ్యానిస్తున్నారు. యాంకర్ రజనీకాంత్ సారధ్యంలో, టీవీ 9 ఛానెల్ వాస్తవాల్ని తప్పుదోవ పట్టిస్తోందని, తన గురించి తప్పుడు ప్రచారాన్ని, తన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తోందని ఆయన అంటున్నారు.

టీవీ 9 పై క్రిమినల్ చర్యలు తీసుకోబోతున్నానని వర్మ అంటున్నారు.అంతేకాదు బీజేపీ నేత తుమ్మల పద్మపై కూడా కేసు పెట్టబోతున్నట్లు వర్మ మరో ట్వీట్ చేశారు. తన గురించి ఆమె మాట్లాడిన విధానం సరిగా లేదన్నారు. తాను తీసుకున్న గొయ్యిలో తానే ప‌డిన‌ట్లు ఉంది టీవీ 9 ప‌రిస్థితి.ఛానెల్ రేటింగ్ కోసం వివాదాల ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మను స్టూడియోలో కుర్చోపెట్టి త‌న పంబం గుడుపుకుంది.వ‌ర్మ‌కు వ్య‌తిరేకంగా క‌వ‌రేజ్ చేసింది.ఇప్పుడు వ‌ర్మ రివ‌ర్స్ అయ్యి టీవి 9 ఛానెల్ పై కేసు పెడతాను అన‌డంతో టీవి 9 ఛానెల్ ప‌రువు మ‌ళ్లీ రోడ్డు మీద ప‌డ‌నుంది.

 

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -