ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రస్తుతం టైం కలసిరావట్లేదు. ఏపనిచేసినా అది గోడకు కొట్టిన బంతిలాగా తయారయ్యంది పరిస్తితి. ప్రతి చిన్న విషయలోనూ అడ్డంగా బుక్ అవుతున్నారు. నిన్నటి వరకు ఎలాగోలా కొడుకు లోకేష్కు మంత్రిపదవి ఇచ్చుకుంటే అది ఎంత రచ్చయ్యిందో అందరికి తెలిసిందే…అది మరవక ముందే ఇప్పుడు కొత్త ఇంటిమీద కూడా నానా రచ్చ అయ్యింది. ఎప్పుడూ తాను పేదవాడినని ..పాలు ,పెరుగు,కూరగాయలు ,చింతపండు అమ్ముకొంటున్నామనీ నిత్యం ఇదే బాబు నోట నుంచి వినిపించేమాట.
అయితే తాజాగా పాలు,కూరగాయలు అమ్ముకొనే బాబు ఇంద్రభవనం లాంటి ఇంటిని నిర్మంచడంపై ఒక ఎత్తైతే ఎవరికీ చెప్పకుండా గుట్టుచప్పుడు కాకుండా గృహప్రవేశం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ ఇంటిపై నానా రచ్చచేసిన బాబు అంత విలాసవంతమైన భవనాన్ని నిర్మించడమేంటని అనుకుంటున్నారు. వైఎస్ ఆర్ సీపీలో పైర్ బ్రాండ్కు పెట్టింది పేరు రోజా.. రోజా పేరు వింటేనే బాబు బ్యాచ్కు ముచ్చెమటలు. సందు దొరికి నప్పుడల్లా బాబు టీంను ఏకేసే రోజా తాజాగా కొత్త ఇంటిపై పైర్ అయ్యారు.. ఒక అడుగు ముందుకేసి పేదవాడినిని, చేతికి వాచీ కూడా లేదని చెప్పుకొనే బాబు ఇంటిపై సాగుతున్న రచ్చను మరో మెట్టుకు తీసుకెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా.
సూటిగా సుత్తి లేకుండా పాయింట్ లోకి వెళ్లేసి.. మాట్లాడే రోజా సంధించిన సందేహాలు బాబు ఇంటి ముచ్చటపై ఆయన్ను మరింత ఇరుకున పడేసేలా చేశాయని చెప్పాలి. ఏదైనా ప్రభుత్వం ఖర్చులపై స్వేత పత్రం విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తారు కానీ రోజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. బాబు కొత్తగా కట్టుకున్న ఇళ్లు ఖర్చులపై స్వేత ప్తరం విడాదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సారాలలో కోట్లాది రూపాయలు ఇంటికి ఎలా ఖర్చు పెట్టారనీ ప్రశ్నించారు. పట్టిసీమ,రాజధాని నిర్మానంలో దోచుకున్న డబ్బులతోనే ఇల్లు కట్టుకున్నారన్నారు. నాటి వైశ్రాయ్నుంచి నేటి వరకు నీజరాజకీయాలు చేస్తున్నారనీ ధ్వజమెత్తారు.ఆరునెలల వ్యవధిలో బాబు కుమారుడు లోకేశ్ ఆస్తులు 22 రెట్లు ఎలా పెరిగాయని ప్రశ్నించిన రోజా.. దేశంలో పాలు.. కూరగాయలు అమ్మేవాళ్లు చాలామందే ఉన్నా.. ఒక్క చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ సంస్థ మాత్రమే పెరగటం ఏమిటంటూ విస్మయాన్ని వ్యక్తం చేశారు. మరి రోజా సంధించింన ఈ ప్రశ్నలకు బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
Related