- Advertisement -
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జయంతి సందర్భంగా మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు నివాళులర్పించారు. వారికి ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వం కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ గొంతుకగా ఉండేవారని.. బిజేపి నేతలు కొనియాడారు. ప్రతి సమస్యపై అవగాహన కలిగి ఉండేవారని.. దేశ రాజకీయాల్లో జైట్లీకున్న అపార అనుభవంతోనే ఇది సాధ్యమైందని కీర్తించారు.
అరుణ్ జైట్లీకి నివాళులర్పించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన సేవలను స్మరించుకున్నారు. మేలైన పనితీరు, అంకిత భావంతో భారతీయ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆయనొక ఉత్తమ పార్లమెంటేరియన్ అని తెలిపారు.దేశ ప్రజల జీవితాల బాగుకై జైట్లీ నిరంతరం పాటుపడ్డారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. పార్టీని బలోపేతానికి సైతం ఆయన కృషి మరువలేనిదని పేర్కొన్నారు.