Thursday, May 2, 2024
- Advertisement -

మహేష్ పై ఆశలు వదిలేసుకున్న దర్శకుడు

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో ఎన్ని సినిమాలు వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమాలు కొన్ని ఉంటాయి. అలంటి వాటిల్లో అప్పట్లో శివ అయితే, మన జెనరేషన్ కి ఆ మధ్య వచ్చిన అర్జున్ రెడ్డి క్లాసిక్ గా చెప్పుకోవచ్చు. విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరో హీరోయిన్లు గా వచ్చిన ఈ సినిమా ని సందీప్ రెడ్డి వంగ తన స్వీయ దర్శకత్వం లో నిర్మించాడు. సందీప్ రెడ్డి ఎంతో కష్ట పడి ఈ సినిమా ని తీసి విడుదల చేసి పెద్ద విజయం సాధించాడు. ఆ తర్వాత మొట్ట మొదటగా ఈ దర్శకుడిని పిలిపించుకొని కథ విన్నది మహేష్ బాబు. మహేష్, సందీప్ కాంబినేషన్ లో గీత ఆర్ట్స్ నిర్మాణం లో ఒక సినిమా రానుంది అనే టాక్ కూడా వచ్చింది. అయితే మహేష్ తన సొంత సినిమా లో పడి లేట్ చేయడం తో సందీప్ కూడా టైం సేవ్ చేసుకోవడానికి అర్జున్ రెడ్డి ని హిందీ లో కబీర్ సింగ్ గా మార్చాడు.

ఈ శుక్రవారం కబీర్ సింగ్ విడుదల అవుతుంది. ఇక సందీప్ మళ్ళీ తెలుగు పరిశ్రమ కి ప్రయాణం అవ్వడం ఖాయం. మహేష్ సందీప్ తో సినిమా సంగతి ని ఎప్పుడో వదిలేసాడు. ప్రాక్టికల్ గా ఈ ప్రాజెక్ట్ మీద కూర్చొని టైం వృధా చేసుకోవడం తప్ప ఏమి లేదు అని సందీప్ కూడా అర్ధం చేసుకున్నాడు. అందుకే మహేష్ ని వదిలేసి ఇప్పుడు మరలా విజయ్ తో నే ఇంకో సినిమా చేసి తెలుగు లో మళ్ళీ తన ఉనికి ని తిరిగి చాటుకోవాలని ప్రయత్నం సందీప్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -