- Advertisement -
టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించడంతో, హైదరాబాద్ పోలీసులు ఆమెకు జరిమాన విధించారు. ఈమె సోమవారం రాత్రి హైదరాబాద్ జూబ్లిహిల్స్ ప్రాంతంలో వెళ్తుండగా,
ట్రాఫిక్ పోలీసులు ఆమె కారుకు ఉన్న నంబర్ ప్లేట్ను చూసి ఆపారు. సానియా మిర్జా కారుకు ఉన్న నంబర్ ప్లేట్ ట్రాఫిక్ రూల్స్ కి విరుద్దంగా ఉండటంతో, ఆమెకు పోలీసులు Rs.200 జరిమానా విధించారు. ఈమె తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న విషయం అందరికి తెలిసిందే..