- Advertisement -
పశ్చిమగోదావరి జిల్లా… దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అతని అనుచరులు పరారీలో ఉన్నారు. వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వేట మొదలు పెట్టారు.గురువారం పినకడిమిలో దళిత యువకులపై దాడి చేసిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి.
బాధితులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు రాసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా… ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఎస్సీలు ఆందోళన చేశారు. వెంటనే చింతమనేని ప్రభాకర్నీ, ఆయన అనుచరులనూ అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. వ్యవహారం ముదరటంతో ఏ క్షణమైనా తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది.