Sunday, May 5, 2024
- Advertisement -

ఆ సీనియర్ హీరోయిన్ జగన్ ను ఎందుకు కలిసిందబ్బా…!

- Advertisement -

ఉన్న ఫలంగా జగన్ మోహన్ రెడ్డిని కలిసి అందరినీ ఆశ్చర్యపరించింది అలనాటి హీరోయిన్ రాశి.

ప్రస్తుతం సినిమా అవకాశాలు లేని ఆమె పెద్దగా వార్తల్లో కనిపించడం లేదు. అయితే ఉన్నట్టుండి ఆమె జగన్ తో సమావేశం అయ్యింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు వెళ్లి జగన్ ను కలిసింది. కేవలం తను మాత్రమే కాక.. తన భర్త కూతురుతో కలిసి జగన్ ను కలిసింది రాశి. అదేంటి.. అంటే, తన కూతురు పుట్టిన రోజు అని.. అందుకే జగన్ ను కలిశామని.. తమ కూతురిని జగన్ ఆశీర్వదించాడని ఆమె చెప్పింది. ఈ  సమావేశంలో అంతకు మించి విశేషం ఏమి లేదని వివరించింది.

రాశి ఒక దశలో తెలుగులో ప్రముఖ హీరోయిన్ గా నిలిచింది. చైల్డ్ ఆర్టిస్టు గా మొదలుకొని హీరోయిన్ వరకూ ప్రముఖ పాత్రలు పోషించింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుముఖం పట్టాకా…  ఆమె వివాహం చేసుకొని సెటిలయ్యింది. 

ఇలాంటి నేపథ్యంలో… ఆమె రాజకీయాల్లోకి వస్తుందని కూడా గతంలో వార్తలు వచ్చాయి. అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలోనే రాశి పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు వచ్చాయి. అయితే.. అప్పట్లో అది జరగలేదు. అయితే రాశి ఇప్పుడు ఉన్నట్టుండి ప్రతిపక్ష నేతతో సమావేశం అయ్యింది. బహుశా ఏమైనా ఆమె పొలిటికల్ ఎంట్రీ కి రెడీ అవుతోందేమో!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -