వైఎస్సార్ మరణించాకా జగన్ పై దుమ్మెత్తిపోసిన వాళ్లలో ముందున్నారు కొంతమంది నేతలు. ఈ జాబితాలో తెలుగుదేశం నేతలతో పాటు కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. వీరు తీవ్రమైన పదజాలంతో జగన్ పై విరుచుకుపడ్డారు.
జగన్ ను అనేక రకాలుగా నిందించారు, అయితే ఇప్పుడు మాత్రం అలాంటి వారి టోన్ లో మార్పు కనిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డిపై వారు చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు.
అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ లో గతంలో జగన్ పై వీర స్థాయి విరుచుకుపడ్డారు. జగన్ పై దుమ్మెత్తిపోశారు. జగన్ సొంతంగా పార్టీ పెట్టుకున్న సమయంలో వీరు కాంగ్రెస్ నేతల హోదాలో జగన్ పై విమర్శల వాన కురిపించారు. అయితే తాజాగా జగన్ ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ తో దీక్ష చేపట్టిన నేపథ్యంలో మాత్రం వారు పాజిటివ్ గా మాట్లాడారు. జగన్ దీక్షా దక్షతను వారు అభినందించారు. జగన్ మోహన్ రెడ్డి కి మద్దతు పలికారు.
హర్షకుమార్ అయితే… ప్రభుత్వంపై ధ్వజమెత్తాడు. జగన్ దీక్ష విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన ఖండించాడు. జగన్ దీక్షకు తన మద్దతు ఉంటుందని ప్రకటించాడు. మరి ఒకప్పుడు జగన్ ను విమర్శించిన వాళ్లు ఇప్పుడు ఆయనను ప్రశంసించడం విశేషమే కదా!