Friday, April 26, 2024
- Advertisement -

కేక్ తో ఎస్పీ బాలుకి ఘన నివాళి..!

- Advertisement -

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి తమిళనాడు సేలం పట్టణంలోని ఓ బేకరి వ్యక్తి వినూత్నంగా నివాళి అర్పించాడు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకుని ఆరు అడుగుల ఎత్తయిన బాలు విగ్రహాన్ని కేక్​తో తయారు చేయించాడు.

ఈ కేక్​ తయారీ కోసం 100 కేజీల పంచదార, 80 గుడ్లు వాడినట్లు బేకరి ఓనర్​ సతీష్​ పేర్కొన్నాడు. ఆరుగురు కలిసి మూడు రోజుల పాటు ఈ కేక్​ విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలిపాడు. గతంలోనూ…. ఈ బేకరిలో నటుడు రజనీకాంత్, పలువురు ప్రముఖ క్రికెటర్ల ప్రతిరూపాలను కేక్​తో తయారు చేసినట్లు వెల్లడించాడు. బాలు విగ్రహాన్ని కొన్ని రోజుల పాటు బేకరిలో ప్రదర్శనకు ఉంచనున్నట్లు పేర్కొన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -