- Advertisement -
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. నన్ను భౌతికంగా నిర్మూలించేందుకు ఓ రాజకీయ పార్టీ కిరాయి హంతకులకు సుపారీ కూడా ఇచ్చిందంటూ దీదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నన్ను చంపేందుకు కుట్ర జరిగినట్టు నా దృష్టికి వచ్చింది. ఇందుకోసం ఓ పార్టీ సుపారీ కూడా ఇచ్చింది. అడ్వాన్స్ తీసుకున్న కిరాయి హంతకులు నా నివాసం, కార్యాలయం, ఇతర సమీప ప్రాంతాల్లో రెక్కీ కూడా నిర్వహించారు’’ అంటూ జీ24 చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ చెప్పారు.
ముందుగా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి, తర్వాత భౌతికంగా నిర్మూలించే ప్రణాళికతో కుట్ర జరుగుతున్నట్లు మమత చెప్పారు. ‘‘కాకపోతే నాకివన్నీ అలవాటైపోయాయి. గతంలో హత్యాయత్నాల నుంచి ప్రాణాలతో బయటపడ్డా’’నని బెంగాల్ సీఎం తెలిపారు.