Monday, May 13, 2024
- Advertisement -

మాయావతితో దోస్తీకి రెడి

- Advertisement -

మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్వాది పార్టీతో చేతులు కలిపేందుకు సిద్దమని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు.

అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక పెట్టారు. అదేంటంటే లాలూ చొరవ తీసుకుంటే, బీఎస్పీతో చేతులు కలిపేందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు’ అని ములాయం అన్నారు. 23 ఏళ్ల విరామం తర్వాత బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్, జేడీ(యూ) నాయకుడు నితీష్ కుమార్ మళ్లీ ఒక్కటయ్యారు. ఇదే తరహాలో బీఎస్పీ, ఎస్పీ కలిసిపోవాలని  ఆయన సూచించారు.

1993లో యూపీలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ఈ కూటమి ఓడిపోవడంతో బీఎస్సీతో కలిసి పోటీ చేసి తప్పుచేశామని అప్పట్లో ములాయం సింగ్ వ్యాఖ్యానించారు. ఏనుగు గుర్తు ఉన్న బీఎస్సీతో సైకిల్ గుర్తు ఉన్న సమాజ్వాదీ పార్టీకి మళ్లీ జట్టు కుదురుతుందో, లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -