Monday, May 6, 2024
- Advertisement -

భద్రాది.. ఒంటిమిట్ట లో ఏర్పాట్లు

- Advertisement -

రామయ్య తండ్రి పెళ్లికి సర్వం సిద్దం అవుతున్నాయి. తెలంగాణలోని భద్రాచలం, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట రామాలయాల్లో సీతా రామచంద్రుల కల్యాణం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలంలో చలువ పందిళ్లు వేశారు.

కల్యాణం జరిగే మిథిల మండపాన్ని అంగరంగ వైభవంగా సిద్ధం చేశారు. ఇక స్వామి, అమ్మవార్లు తలపై వేసుకునే తలంబ్రాలను తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ నుంచి రైతులు తీసుకువచ్చారు. ఈ తలంబ్రాలు కోటి ఉండడం ఓ విశేషమైతే వాటిని నాలుగు నెలల పాటు రెండు వందల మంది భక్తులు గోటితో వొలిచి సిద్ధం చేయడం మరో విశేషం. ఈ సందర్భంగా భద్రాదిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని ఒంటి మామిడిలో తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో శ్రీరాముని కల్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచల రామయ్యకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -