ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు శ్రీవేంకటేశ్వరా భక్తిచానల్ (ఎస్వీబీసీ) చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాఘవేంద్రరావు ఈవోతో పాటూ ప్రభుత్వానికి పంపారు. వయోభారంతో ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు దర్శకేంద్రుడు తెలియజేశారు. తనకు ఇన్ని రోజులు సహకరించిన ఛానల్ సిబ్బంది, టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
రాఘవేంద్ర రావు 2015 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉంటున్నారు. గత ఏడాది ఏప్రిల్ 21వ తేదీన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ ఛైర్మన్గా నియమితులయ్యారు కె. రాఘవేంద్రరావు. దేవస్థాన ధర్మకర్తల మండలిలో సభ్యులుగా ఉంటూ.. ఛానెల్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన ఆయనను అప్పటి సీఎం చంద్రబాబు సూచనలతో రాఘవేంద్రరావును భక్తి ఛానెల్ చైర్మన్గా నియమించింది టీటీడీ. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక రాజీనామా చేయడమే మంచినదే అభిప్రాయం వ్యక్తం అవుతన్నాయి.