- Advertisement -
మొహాలీలో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక ఎదురీదుతోంది. ఆదిలోనే వికెట్లు కోల్పోయిన లంక కష్టాల్లో పడింది. భారత్ నిర్దేశించిన 393 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 25 ఓవర్లలో 124పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. 16 పరుగులు చేసిన ఓపెనర్ గుణతిలక బుమ్రా బౌలింగ్ లో ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ తరంగ 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పాండ్యా బౌలింగ్ లో కార్తీక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వన్ డౌన్ లో వచ్చిన తిరిమన్నే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. డిక్ వెల్లా 20 పరుగులు చేసి చవాల్ బౌలింగ్లో క్యాఔట్ అయ్యి రు. క్రీజులో మథ్యూస్ (46) గునరత్నే (24 ) పరుగుతో ఉన్నారు.