- Advertisement -
జన్యులోపాల కారణంగా వింత శిశువులు జన్మించడం వెంటనే చనిపోవడం లాంటి సంఘటనలు అనేకం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి సంఘటనే కర్నాటకలో చోటు చేసుకుంది. కొడగు జిల్లా సోమవారపేటలో వింత శిశువు జన్మించి కాసేపటికే కన్నమూసింది.
కార్మికుడు జీకే మూర్తి భార్య చిన్నమ్మ సోమవారం రాత్రి నొప్పులు రావడంతో శనివారసంతేలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె వింత శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే శిశువు మరణించింది. బిడ్డకు ఒకటే కాలు ఉంది, వెనుక తోక లాంటి భాగం ఉంది. ఆడ, మగో తెలుసుకోవడానికి జననాంగాలు కూడా లేవని వైద్యులు తెలిపారు.