సర్కార్ ఆదేశాలతో హరియాణాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఇటీవలే పునఃప్రారంభించారు. అయితే విద్యార్థులపై కరోనా ప్రభావం పడుతుండటం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. కైథల్ జిల్లా ఖర్కా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 35మందికి కరోనా పాజిటివ్గా తేలింది. మొదట ఈ స్కూల్ టీచర్ కరోనా బారినపడ్డారు. అనంతరం 150 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 23మందికి పాజిటివ్గా తేలింది.
ఆ తర్వాత మరో 160మందికి పరీక్షలు చేయగా 12మందికి వైరస్ నిర్ధరణ అయింది. ఇలా మొత్తం 35మందికి వైరస్ సోకింది. దీంతో పాఠశాలకు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించారు. మిగతా విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారుకరోనా కేసుల నేపథ్యంలో జిలాల్లోని మిగతా ప్రభుత్వ పాఠశాలలను సందర్శించినట్లు కైథల్ సీఎంఓ ఓం ప్రకాశ్ తెలిపారు.
అన్ని చోట్ల విద్యార్థులు కరోనా నిబంధనలు కఠినంగా పాటిస్తున్నట్లు చెప్పారు.పాఠశాలకు వచ్చే విద్యార్థులందరీ ప్రవేశద్వారంలో థర్మల్ స్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ విమలా దేవి తెలిపారు. తరచూ శానిటైజ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తల్లిదండ్రుల అంగీకార పత్రంతోనే విద్యార్థులను అనుమతిస్తునట్లు పేర్కొన్నారు. విద్యార్థులను పాఠశాలలకు పంపాలని వినతి చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.
కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం..!
మళ్ళీ తెర పైకి భైంసా.. ఆ ఎంపీ హౌజ్ అరెస్ట్..!
ఏపిలో ఎమ్మెల్సీలు ఆరుగురు ఏకగ్రీవం.. మండలిలో పెరిగిన వైసీపీ బలం!